సారంగాపూర్, 13 September
నిర్మల్ జిల్లా మండలం సిర్పల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో ఒక లేగదూడ వన్యప్రాణి దాడిలో మృతి చెందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సిర్పల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి ( నిర్మల్ జిల్లా మండలం సిర్పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం ఉన్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో లేగదూడ వన్యప్రాణి దాడిలో మృతి చెందింది. ఘటనపై దాడి చేసిన వన్యప్రాణిని గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా లేగదూడపై చిరుతపులి దాడి చేసినట్లు నిర్ధారణ అయినట్లు నిర్మల్ అటవీ పరిధి అధికారి రామకృష్ణరావు తెలిపారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని ఆయన ప్రజలకు సూచించారు. గ్రామాల పరిసరాల్లో పశువులపై వన్యప్రాణుల దాడి జరిగిన వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. నిబంధనల ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉప అటవీ క్షేత్రాధికారి మొహమ్మద్ నజీర్ ఖాన్, వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధి హర్షవర్ధన్, అటవీ క్షేత్ర సహాయకులు సంధ్య, సంతోష్, సుజాత, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.












