మిర్యాలగూడ, 10 September
మండలం ఉట్లపల్లిలో పోషణ మాసం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలను శిశువులు, గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పి. చంద్రశేఖర్ కోరారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు.
అంగన్వాడీ కేంద్రాలను శిశు,గర్భిణీలు,బాలింతలు సద్వినియోగం చేసుకోవాలి : చంద్రశేఖర్ (మనోరంజని తెలుగు టైమ్స్) అంగన్వాడీ కేంద్రాలను శిశు,గర్భిణీలు,బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని ఉట్లపల్లి సర్పంచ్ పి. చంద్రశేఖర్ కోరారు. ఐసీడీస్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సీడీపీఓ పి.వేణుగోపాల్ రావు షెడ్యూల్ ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం, మన అంగన్వాడీ - మన బాధ్యత అనే థీమ్ తో నిర్వహించాలన్న కార్యక్రమంలో భాగంగా మండలం ఉట్లపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణా మాసంనునిర్వహించారు. అంగన్వాడీల్లో అందించే పోషకాహారం పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. సూపర్ వైజర్ కె.నాగమణి మాట్లా డుతూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి ఆహార వైవిధ్యాన్ని తల్లులకు తెలిపారు. అదేవిధంగా ధాన్యాలు చిరుధాన్యాలు వాటి విశిష్టత గురించి, వాటిని తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. టీహెచ్ఆర్ వంటకాలు, హెచ్సిఎం మెనూ, స్థానికంగా లభించిన ఆహార పదార్థాలతో తయారు చేసే ప్రాంతీయ వంటకాలను ప్రదర్శించారు. అలాగే పసుపు, నారింజ రంగు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, వంట నూనెలు, ప్రాముఖ్యత వాటి వలన పిల్లలకు, గర్భిణీ, బాలింతలకు, తల్లులకు కలిగే లాభాలు వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాతంగి రవి,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధా, అంగన్వాడీ టీచర్స్ కె.నాగమ్మ జి.ఉమామహేశ్వరీ అంగన్వాడీ హెల్పర్ ఎం.రాధిక బి.శోభారాణిలు పాల్గొన్నారు.












