ముధోల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ షఫీ తల్లిగారికి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ముధోల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ షఫీ తల్లిగారికి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స విషయం తెలుసుకున్న ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు ఎల్లవేళలా అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
తమ నివాసానికి వచ్చి తల్లిగారిని పరామర్శించి, ధైర్యం నింపిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్కు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ షఫీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












