హైదరాబాద్, 15 September
హైదరాబాద్లో ఈనెల 26 నుంచి 28 వరకు ప్రముఖ కళాకారిణి విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని 50 గంటల పాటు ప్రజా కళా జాతరను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డిని విమలక్క ఆహ్వానించారు.
*50 ఏళ్ల విమలక్క ప్రస్థానానికి ప్రజా కళా జాతర* *50 గంటల పాటు ఏకధాటిగా ఆటపాటలు..* *ప్రజా కళారూపాలతో మహా జాతర* *షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డిని ఆహ్వానించిన విమలక్క* హైదరాబాద్లో ఈనెల 26 నుంచి 28 వరకు జరగనున్న 50 ఏళ్ల విమలక్క కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 50 గంటల ప్రజా కళా జాతరకు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డిని విమలక్క ఆహ్వానించారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో 50 గంటల పాటు ఏకధాటిగా ఆటపాటలు, ప్రజా కళారూపాలతో కళా ప్రదర్శనలు కొనసాగనున్నాయి. ఐదు దశాబ్దాలుగా ప్రజా కళారంగంలో విమలక్క సాగిస్తున్న ప్రస్థానాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ మహా కళా జాతరలో ప్రజలు, కళాకారులు, అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రజా సమస్యలను కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన విమలక్క ఐదు దశాబ్దాల కళా ప్రయాణాన్ని ఘనంగా చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డిని కలిసిన విమలక్క కార్యక్రమానికి హాజరై ప్రజా కళా జాతరలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, మాజీ ఎంపీటీసీ కట్ట వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ మురళీమోహన్ అప్పి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కోకన్వీనర్ జంగయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు..












