Assembly, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ, ఇది అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు.
*మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారు* *మహిళా ఎమ్మెల్యేల పై దాడి అప్రజాస్వామికం* *మహిళా ఎమ్మెల్యేలకు రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి* *వెయ్యి రోజుల ప్రజాపాలనలో ప్రజల అవస్థలు* మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారుని మాజీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకురాలు ప్రశ్నించారు. అసెంబ్లీ వద్ద మహిళ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేల పై దాడి అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలకు రక్షణ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో ప్రజల అవస్థలు పడుతున్నారని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి, ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు..












