అటవీ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 11
జాతీయ అమరుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. గండి రామన్న అర్బన్ పార్క్ చించోలి వద్దగల అమరుల స్థూపం వద్ద అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమరులైన సిబ్బంది కుటుంబ సభ్యులను సన్మానించారు.
జాతీయ అమరుల దినోత్సవం సందర్భంగా గండి రామన్న అర్బన్ పార్క్ చించోలి వద్దగల అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన శ్రీమతి నాగిని మాను మండల అధికారి నిర్మల్. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా నందు శాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైనటువంటి కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ మండలాధికారి నిఘా విభాగం బాసర సర్కిల్, రామకృష్ణారావు ఎఫ్ఆర్ఓ, జిల్లా క్షేత్ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











