లోకేశ్వరం, 7 September
మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం మరియు ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈరోజు మండల కేంద్రంలోని BRS పార్టీ పిలుపుమేరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలులో వైఫల్యం ప్రజావ్యతిరేక పాలనపై బిఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్,ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాగర్,మాజీ PASC చైర్మన్ చిన్నారావు, మాజీ ఎంపీటీసీ,సాయన్న,BRS సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్, BRS నాయకులు సంజీవ్, అనిల్,ప్రవీణ్,సందీప్, దేవేందర్,శీను,దివాకర్ నాయకులు పాల్గొన్నారు











