మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన నాదర్కా వనితకు పురిటినొప్పులు రావడంతో అత్యవసర వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి, ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్సులో సురక్షితంగా ప్రసవం చేయించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన నాదర్కా వనితకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అత్యవసర సేవలకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అత్యవసర వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఇఎంటి కె. సేవ, వాహన చోదకుడు రాకేష్ వనితను మద్దిపడగ నుంచి ఖానాపూర్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోని తర్లపేట సమీపంలో పురిటినొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్సులోనే సిబ్బంది ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఖానాపూర్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. సకాలంలో స్పందించి ప్రసవానికి సహకరించిన అత్యవసర వైద్య సిబ్బందిని కుటుంబ సభ్యులు అభినందించారు.












